Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

త్వరలో ఎంపీ రంగయ్య ఇంటిని ముట్టడిస్తాం

జీవీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డుంగావత్ బాలాజీ నాయక్
విశాలాంధ్ర – ధర్మవరం : త్వరలో ఎంపీ రంగయ్య ఇంటిని ముట్టడిస్తామని జీవీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డుంగావత్ బాలాజీ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ గిరిజనులు ఓట్లతో గెలిచి గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.
వాల్మీకి, బోయలకు ఏ పార్టీ టికెట్ ఇచ్చినా వారిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం అని సవాల్ విసిరారు. అనంతపురం పార్లమెంట్లోని అన్ని కులాలకు ఎంపీ నో లేకపోతే కేవలం వాల్మీకి బోయలకు మాత్రమే ఎంపీ నో మాకు అయితే అర్థం కావడం లేదు అని దుయ్యబట్టారు.ఎన్నికలకు ముందు వాల్మీకి, బోయల విషయంలో నోరు మెదపని తలారి రంగయ్య ఎంపీగా గెలిచిన అనంతరం నేడు వాల్మీకి,బోయలను గిరిజన జాబితాలో చేర్చడానికి నిరంతరం శ్రమిస్తున్నారని, అనంతపురం జిల్లాలోని ఏ ఒక్క గిరిజన తండా కైనా వెళ్లి ఆయన గిరిజనుల స్థితిగతులను తెలుసుకోవడానికి సందర్శించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ నిధుల కింద వచ్చిన ఒక్క రూపాయి కూడా గిరిజన తండాలకు ఖర్చు పెట్టలేదని, ఇటువంటి వ్యక్తికి రానున్న ఎన్నికల్లో గిరిజనులు తగిన బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారని, అంతేకాకుండా టిడిపి కానీ వైఎస్ఆర్సిపి పార్టీల నుండి ఏ ఒక్క వాల్మీకి, బోయ అభ్యర్థులకు ప్రకటించినా వారికి గిరిజనులు ఓటు వేసే ప్రసక్తే లేదని తెలిపారు. అవసరమైతే గిరిజనులంతా ఏకమై ఎన్నికలను బహిష్కరించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img