విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని కేశవ నగర్ కు చెందిన చేనేత ఎర్రజోడు చంద్ర వినాయక చవితి పండుగ సందర్భంగా తన స్వగృహంలో 118 కేజీల గంధం వినాయకుని తయారుచేసి, గత కొన్ని రోజులుగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. తదుపరి బుధవారం నాడు నిమజ్జనంలో కార్యక్రమంలో భాగంగా నిమజ్జనం కొరకు రోజు వాటర్ ను ఉపయోగించి నిమజ్జన కార్యక్రమాన్ని భక్తుల నడుమ ఘనంగా చేశారు. ఈ కార్యక్రమంలో చంద్ర కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు.