Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మహిళలు సాధికారిక సాధన దిశగా అడుగులు

విశాలాంధ్ర- జెఎన్టియుఏ : మహిళలు సాధికారిక సాధన దిశగా అడుగులు వేస్తూ దేశాభివృద్ధిలో అత్యంత కీలకపాత్రను పోషిస్తూ ఉన్నారని పావని హాస్పిటల్ డా. కాకాని విహసిత పేర్కొన్నారు. మంగళవారం అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. విద్య, వైద్యం, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో మహిళలు విశేష కృషి చేస్తున్నారన్నారు. చైర్మన్ అనంతరం మాట్లాడుతూ..స్త్రీ లేకపోతే జననం గమనం , సృష్టిలో జీవం , అసలు సృష్టే లేదని సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలమని అని అన్నారు. అందరికీ సమాన అవకాశాలను కల్పించడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.వి మూర్తి రావు ఖోకలే, కళాశాల డైరెక్టర్ ఎం. రమేష్ నాయుడు, స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ సురేంద్రనాయుడు,సాధికారత విభాగాధిపతి టి. మాధవి , విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img