Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విద్యార్థులు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి


శివాని ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎండ శ్రీనివాసరావు
విశాలాంధ్ర-లావేరు ( శ్రీకాకుళం): విద్యార్థులు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని చిలకపాలెం శివాని ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎండ శ్రీనివాసరావు అన్నారు. శనివారం కాలేజీ పరిధిలో కల లావేరు మండలం వెంకన్నపేటలో ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే సమాజ సేవ, సంఘ సేవ అలవర్చుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరే అవకాశాలు ఉంటాయని అన్నారు. అలాగే క్రమశిక్షణ, సేవాభావంతో మెలగాలని అన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు ఇంటింటికి వెళ్లి, పారిశుధ్యం, ఆరోగ్యం ఆర్థిక పరిస్థితులు మెరుగు కోసం వివరించారు. అనంతరం శ్రమదానంతో పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img