Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఎల్టిఐ మైండ్ ట్రీ టెక్నాలజీని సందర్శించిన విద్యార్థులు

విశాలాంధ్ర – జె ఎన్ టి యు ఏ: మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ మూడో సంవత్సరం విద్యార్థులు పారిశ్రామిక అన్వేషణలో భాగంగా ఎల్టిఐ మైండ్ ట్రీ టెక్నాలజీని బెంగళూరులోని కేంద్రాన్ని సందర్శించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా సి .యువరాజు తెలిపారు. పరిశ్రమలో పనిచేస్తున్న టీం సభ్యులతో డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటరింగ్, సైబర్ టెక్నాలజీ మొదలగు కోర్సులపై శిక్షణ నైపుణ్యాల కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో టీం సభ్యులు వివిధ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నియామకాల అధికారి ద్రుపద్ వర్మ, ట్రైన్ కవిప్రియ, జున్ను బాబు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img