Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

స్టడీ మెటీరియల్ అందజేత

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు :- ఉప్పుగుండూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి కొలకలూరి వినయ్ స్టడీ మెటీరియల్ అందజేశారు. స్థానిక రోజ్ స్టడీ సర్కిల్ లో ట్యూషన్ లో చదువుతున్న 60 మంది పదో తరగతి విద్యార్థులకు ప్రిన్సిపల్ సామాజిక సేవా కార్యకర్త తెలగతోటి శామ్యూల్ విజ్ఞప్తి మేరకు ఆర్మీ ఉద్యోగి కొలకలూరి వినయ్ 5000 రూపాయల విలువ గలిగిన సోషల్ స్టడీ మెటీరియల్ ఆయన తండ్రి కొలకలూరి సుబ్బారావు ( కొండమంజులూర్ సుబ్బారావు) చేతుల మీదుగా శుక్రవారం విద్యార్థులకు అందజేశారు .విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలకు ఎదిగి తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సుబ్బారావు సూచించారు. కార్యక్రమంలో స్టడీ సర్కిల్ ప్రిన్సిపాల్ తెలగతోటి శామ్యూల్ , తమ్ములూరి సుబ్బారావు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img