Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రారంభమైన వేసవి చెస్, టేబుల్ టెన్నిస్ శిక్షణ తరగతులు

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కళాజ్యోతిలో శనివారం నాడు ఉచిత వేసవి చెస్ అండ్ టేబుల్ టెన్నిస్ శిక్షణ శిబిరం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా రూరల్ సీఐ మన్సూరుద్దీన్ హాజరయ్యారు. అనంతరం వారు చెస్సుతోపాటు టేబుల్ టెన్నిస్ ఆటలు ఆడి ప్రారంభించారు. సిఐ మాట్లాడుతూ వేసవికాలంలో ఇటువంటి క్రీడా శిక్షణా శిబిరాలను నిర్వహించుట సంతోషదాయకమైనదని వారు తెలిపారు. కళాజ్యోతి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించడం, ఎంతోమంది చెస్సు,టేబుల్ టెన్నిస్ క్రీడలను విద్యార్థి స్థాయి నుంచే శిక్షణ ఇవ్వడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ప్రతి కీరాకారుడు ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లినప్పుడే మంచి భవిష్యత్తు జీవితంలో ఉంటుందని వారు తెలిపారు. తాను కూడా విద్యార్థి దశలో క్రీడలు పట్టా మక్కువ చూపే వాడిని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు సింగనమల రామకృష్ణ, స్టేట్ పీడీపీఈటి అసోసియేషన్ ఉపాధ్యక్షులు కే. రామకృష్ణ, స్టేట్ సెక్రటరీ వెంకటేశులు, షాప్ ఉపాధ్యక్షులు రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు రఘు, టీచర్ వేణుగోపాల్, బి ఎస్ ఆర్ మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎం రాంప్రసాద్, కళాజ్యోతి డైరెక్టర్ జగ్గా వేణుగోపాల్, చెస్ కోచ్ శివకృష్ణ, టేబుల్ టెన్నిస్ కోఆర్డినేటర్ నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img