Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

కార్యకర్తకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే సతీమణి సుప్రియ

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని 37వ వార్డులో ఇటీవల ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పర్యటించినప్పుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గోపాల్, సెల్యూ లైటిస్ అనే వ్యాధితో కాలుకు తీవ్రంగా గాయపడి ఇంట్లోనే చికిత్స పొందుతున్నాడు. అప్పట్లో ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. తదుపరి శనివారం ఎమ్మెల్యే స్వగృహంలో కార్యకర్త గోపాల్ కు తన వంతుగా 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి సతీమణి సుప్రియ నగదును శనివారం ఎమ్మెల్యే స్వగృహంలో అందజేశారు. ఈ సందర్భంగా సుప్రియ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతము నిలబెట్టుకున్న ఘనత వారికే దక్కిందన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అడుగుజాడల్లో నేటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆదర్శంగా తీసుకొని, నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ పేరిటన ప్రజల సమస్యలతో పాటు, కార్యకర్తల యొక్క కష్టసుఖాలను కూడా అడిగి, తెలుసుకుని తనవంతుగా ఆర్థిక సహాయం చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని వారు తెలిపారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముకఅని, కార్యకర్తలు బాగుంటేనే పార్టీ బాగుంటుందన్న అభిప్రాయంతో ఎమ్మెల్యే నియోజకవర్గంలో అభివృద్ధి బాటలో ముందుకు వెళుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే తో పాటు సతీమణిగా నేను, ఎమ్మెల్యే సోదరుడు వెంకట కృష్ణారెడ్డి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరుగుతోందని వారు తెలిపారు. మున్ముందు కూడా కార్యకర్తల యొక్క కష్టసుఖాలను తెలుసుకొని, ముందడుగులో తాము ఎల్లప్పుడూ ఉంటామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img