విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న కేబీఎన్ మెడికల్ జనరల్ స్టోర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం సిపిఎం పార్టీ నాయకులు తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి మధుసూదన్ నాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యుల రంగారెడ్డి మాట్లాడుతూ దొంగ సర్టిఫికెట్లతో కేబీఎన్ మెడికల్ జనరల్ స్టోర్ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెడికల్ స్టోర్స్ నిర్వాహకులు మందులు కోసం వచ్చిన వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా మందులు తీసుకున్న అనంతరం బిల్లులు పేపర్లో ఇవ్వకుండా తెల్ల పేపర్లో రాస్తూ తక్కువ ధరల మందులను ఎక్కువ ధరలకు ఇష్టానుసారంగా అమ్ముతున్నారని ఆరోపించారు.ఈ విషయంపై కేబీయన్ నిర్వహకులను ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి సంబంధిత అధికారులకు మామూళ్లు ఇస్తున్నామని మమ్మల్ని ఎవరు ఏం చేసుకోలేరని నిర్లక్ష్య ధోరణిలో సమాధానాలు చెబుతూ గొడవలకు దిగుతున్నారని ఆరోపించారు.ప్రజల జీవితాలతో చెలగాటం మాడడమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మెడికల్ జనరల్ స్టోర్ పై చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని లేనిపక్షంలో రోడ్డెక్కి ధర్నా చేపడతామని హెచ్చరించారు.అనంతరం తాసిల్దార్ షాబుద్దీన్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిద్ధప్ప,కే వెంకటేశులు,సీనప్ప, రవికుమార్,రైతు సంఘం నాయకులు మురళి, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.