Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోండి

కౌన్సిలర్ గజ్జల శివ
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో ఈనెల 8వ తేదీ నుండి జూన్ 11వ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరమును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్ గజ్జల శివ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులతో పాటు నేటి యువతీ యువకులు ఈ వేసవి సెలవుల్లో గ్రంథాలయములోని వివిధ రకాల విజ్ఞాన పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు లభ్యం కావడం, వాటిని అభ్యసించే విధంగా కావలసిన అన్ని రకాల విషయాలను నేర్చుకునే అవకాశం ఉందన్నారు. అనంతరం పాఠకులతో గ్రంథాలయ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ద్వారా చర్చించి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని అంజలి సౌజన్య వతి, సిబ్బంది రమణ నాయక్, సత్యనారాయణ, శివమ్మ, టీచర్ నరసింహులు, ఎల్ఐసి ఏజెంట్ నాగరాజు, నారాయణస్వామి, ముకుంద తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img