Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

పీజీ సెట్ లో కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ

విశాలాంధ్ర ధర్మవరం:: ఇటీవల పీజీ సెట్ లో వివిధ యూనివర్సిటీ కు చెందిన విద్యార్థులు పరీక్షలను రాయడం జరిగింది. ఈ పీజీ సెట్ ప్రవేశ పరీక్షలో పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తమ ప్రతిభను పెంచి మంచి ఔన్నత్యాన్ని తీసుకొని వచ్చారని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కళాశాలలో ఎం కామ్ లో.. కె. చైతన్య, ఎంసీఏ విభాగంలోఈ. మంజునాథ్, జి. నవీన్ కుమార్, ఏ. అనిల్ కుమార్, ఎస్. దాదా కలందర్, ఎం. రామాంజనేయులు, ఎం. మోహన్ కృష్ణ, జి. గణేష్ లు మొత్తం 9 మంది విద్యార్థులు ప్రతిభ చాటడం జరిగిందన్నారు. అనంతరం ఈ ప్రవేశిక పరీక్షల్లో ప్రోత్సహించిన కామర్స్ అధ్యాపక బృందమునకు, ప్రతిభ ఘనపరిచిన విద్యార్థులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు వారు తెలియజేశారు. కళాశాల తరపున మా తోడ్పాటు తప్పక ఉంటుందని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img