Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రతిభ చాటిన బిఎస్సార్ మున్సిపల్ బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మంచి మార్కులతో జరిగిందని బాలుర పాఠశాల హెచ్ఎం. రాంప్రసాద్, బాలికల పాఠశాల హెచ్ఎం. ఉమాపతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం. రాంప్రసాద్ మాట్లాడుతూ బాలుర పాఠశాలలో 219 మందికి 149 మంది ఉత్తీర్ణత సాధించి 68 శాతం నమోదు కావడం జరిగిందన్నారు. ఇందులో బి. సాయి ప్రసాద్ 586 మార్కులు, కే.హేమంత్ అండ్ జి. సాయి శ్రీహరి 579 మార్కులు, పి. లోకేష్ అండ్ జి. వెంకటేష్ 576 మార్కులు, ఎల్. జ్యోతి ఆదిత్య 575 మార్కులు రావడం జరిగిందన్నారు. 500 మార్కులకు పైగా 47 మంది కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా బి ఎస్ ఆర్ బాలికల ఉన్నత పాఠశాల ఉమాపతి మాట్లాడుతూ మొత్తం 204 మంది కు గాను 146 మంది ఉత్తీర్ణత సాధించార ని, ప్రథమ స్థాయిలో 126 మంది, ద్వితీయ స్థాయిలో 12 మంది, తృతీయ స్థాయిలో 8 మంది కైవసం చేసుకున్నారని తెలిపారు. పాఠశాల ఉత్తీర్ణత శాతం 71 శాతం అని తెలిపారు. ఇందులో ఎం. పూజ 57 7 మార్కులు, ద్వితీయ హరిణి 576 మార్కులు, తృతీయలో అంజలి బాయి 574 మార్కులు కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో పాటు హెడ్మాస్టర్లు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img