Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జూడోలో ప్రతిభ విద్యార్థులు

విశాలాంధ్ర – ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేట మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం ఆర్డిటి ఆధ్వర్యంలో జూడో క్లబ్ ను నిర్వహించడం జరిగింది. ఆర్డిటి తరఫున భూపాల్లో జరిగిన సెకండ్ ఖేలో ఆల్ ఇండియా ఉమెన్స్ జూడో ఛాంపియన్షిప్ పోటీలలో, ధర్మవరం విద్యార్థులు చూపిన ప్రతిభను చూపడం జరిగింది. ఈ సందర్భంగా మైనస్ 32 కేజీ విభాగంలో వై. సాయి ప్రియ ర్యాంకింగ్ మోడల్ ను సాధించారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే క్రీడల్లో పాల్గొన్న జూడో క్లబ్ క్రీడాకారులను అందరినీ కూడా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైస్ చైర్మన్ పెనుజురు నాగరాజు, మాజీ వైస్ చైర్మన్ చంద్రమూరి నారాయణరెడ్డి, పాఠశాల హెచ్ఎం మేరీ వర కుమారి, పీఈటి అశ్విని, జూడో ఎన్ఐఎస్ కోచ్ ఇనాయత్ భాష అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల పట్ల కూడా మంచి నైపుణ్యాన్ని సాధించాలని విద్యార్థులకు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img