Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బాధితులను ఆదుకోవడమే ప్రభుత్వమే యొక్క లక్ష్యం

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం : బాధితులను ఆదుకోవడమే ప్రభుత్వము యొక్క లక్ష్యమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం వారి స్వగృహంలో నియోజకవర్గంలోని 26 మంది బాధితులకు రూ.34.45 లక్షల విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను వారు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నేడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నవరత్నాల పేరిటన అన్ని వర్గాల వారిని ఆదుకోవడం జరుగుతుందని, ప్రజలు కూడా ప్రభుత్వం వైపే మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూపుతున్న చోరువ, కృషి మరువలేనిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి గుర్రపు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img