Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

గుంతకల్లులో నూతనంగా రీ-సర్వేను ప్రారంభించిన తాహశీల్దార్

విశాలాంధ్ర-గుంతకల్లు : రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రి సర్వేలో భాగంగా శుక్రవారం మండలంలోని సంగాల నుండి కర్నూలు జిల్లా అయిన చిప్పగిరి మండలం నంచర్ల గ్రామం మద్దికెర మండలం & మద్దికేర గ్రామం మూడు గ్రామాల నందు రీ-సర్వే లో భాగంగా శాశ్వతంగా రాల్లను నాటి గుంతకల్లు మండల తాహశీల్దార్ బి.రాము చేతులమీదుగా భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇతర రెండు మండలాల గ్రామ సర్వేయర్లు, వి ఆర్ ఓ లు, గుంతకల్లు మండలం రీ- సర్వే డిప్యూటీ తహశీల్దార్, మండల సర్వేయర్ తో కలసి సర్వే చేయడం జరిగిందని తాహశీల్దార్ రాము తెలిపారు. ఈ రీ సర్వేలో డిప్యూటీ తహశీల్దార్ ఆదినారాయణ, గుంతకల్లు సర్వేయర్ మారెప్ప, వీఆర్వో కృష్ణ, సిబ్బంది శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img