Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలి

బోయ రవిచంద్ర
విశాలాంధ్ర – ధర్మవరం : వాల్మీకులను ప్రభుత్వం ఎస్టీ జాబితాలోకి చేర్చాలని వాల్మీకి సంఘం సీనియర్ నాయకుడు బోయ రవిచంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు స్థానిక టిడిపి కార్యాలయంలో సోమవారం వాల్మీకి కులస్తుల ఆత్మీయ సమ్మేళనా కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత వాల్మీకి మహర్షి చిత్రపటానికి బోయ రవిచంద్రతోపాటు వాల్మీకులు అందరూ కూడా పూలు వేసి నివాళులు అర్పించారు.తదుపరి వారు మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని, పలుమార్లు ఆందోళన కార్యక్రమాలను తోపాటు అధికారులకు వినతి పత్రాలు అందజేసిన, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. వాల్మీకులకు రాజకీయ చైతన్యం కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వమేనని తెలిపారు. ప్రతి మండలానికి వాల్మీకి కళ్యాణ మండపముతో పాటు ఎస్టీ సాధన తదితర అంశాలపై ధర్మవరం నియోజకవర్గంలో చేపట్టే నారా లోకేష్ ఇవ్వగలం పాదయాత్రలో కూడా విన్నవించడం జరుగుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. పరిటాల శ్రీరాములు ఎమ్మెల్యేగా వాల్మీకులంతా కలిసికట్టుగా పోరాడుతామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు పోతుకుంట లక్ష్మన్న, గొట్లూరు శీనా, బొట్టు కృష్ణ ,చీమల రామాంజి, పూలకుంట్ల మహేష్, టైలర్ గోపాల్, మరుస హరి ,మంజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img