Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

వసికేరి రాజగోపాల్ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ 15వ వార్డు సభ్యులు వసికేరి మల్లికార్జున తండ్రి వసికేరి రాజగోపాల్ 11వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుమారుడు వశికేరి మల్లికార్జున సోమవారం ఉరవకొండలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తండ్రి జ్ఞాపకార్థం పట్టణంలో ఐదవ సచివాలయంలో సిబ్బందికి నాలుగు బయోమెట్రిక్ డివైస్లన్ అందజేశారు. స్థానిక బైపాస్ లో ఉన్న మదరసాలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ తన తండ్రి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరము కూడా తాను పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img