Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వైద్య ఆరోగ్య శాఖలో కంటింజెంట్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి

జిల్లా ఎన్జీవో సంఘం డిమాండ్

విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : జిల్లా ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో వైద్య డ ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కంటింజెంట్ ఉద్యోగులకు జిఓ 549, తేదీ 26.10.2019 ప్రకారం నెలకు 16,000/- రూపాయలు వేతనాలు చెల్లించాలని డిఎం డ ఎచ్ఓ డాక్టర్ వీరబ్బాయి ని కలిసి వినతి పత్రాన్ని శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దాదాపు 25 నుండి 30 సంవత్సరాలుగా పిఎచ్ సి లలో కంటింజెంట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వము వెంటనే పెంచిన జీతాలు చెల్లించాలని జిల్లా ఎన్జీవో సంఘం తరుపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు బి. చంద్రశేఖర్ రెడ్డి , డి. చంద్రమోహన్ , జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. జమీలా బేగం , ప్రభుత్వ నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు యూ.కుళ్లాయప్ప , నాయకులు గౌసేపీరా ,నాగభూషణం ,పెద్దన్న తోపాటు కంటిన్జెంట్ ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img