Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మహిళలు ఆర్థిక స్వాలంబనతో విజయఫలాలు

విశాలాంధ్ర – జేఎన్టీయూఏ: మహిళలు ఆర్థిక స్వాలంబనతో విజయఫలాలు సాధించగలరని టి డి పి మాజీ జెడ్పిటిసి గాండ్ల విశాలాక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం సంసిద్ధ సెయింట్ జోసెఫ్ పాఠశాలలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు అమ్మగా ప్రేమ ఆప్యాయతలతో పాటు కుటుంబ సంరక్షణ, సామాజిక, నైతిక విలువలను, దేశ భవితకు పునాది మహిళలు పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. ప్రిన్సిపల్ శ్రీవాణి మాట్లాడుతూ.. మహిళలు మేదో సంపత్తితో పరిశోధన, రక్షణ, ఆర్థిక , సామాజిక సేవ రంగాలలో తమదైన ప్రతిభను పురుషులకు దీటుగా చాటుతున్నారు అని అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలిచిన విజేతులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు, పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img