Friday, April 19, 2024
Friday, April 19, 2024

విజయ దుందుభి మోగించిన యశోద కాన్సెప్ట్ హైస్కూల్

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని యశోద కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో విజయదుందుభి మోగించారని డైరెక్టర్ పృథ్వీరాజ్, ప్రిన్సిపాల్ అనూప్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షా ఫలితాలలో 156 మందిలో 580 మార్కుల పైన నలుగురు, 540 పైన 54 మంది విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఎం. హన్సి 588 మార్కులు, జి. లలిత ప్రియ 586, టి. శ్రీజ 584, కే. లక్ష్మీ ప్రియా 580, పి. వినీల 579, కె. మనురాజ్ 578, పి. ఉష అండ్ ఏ. భరద్వాజ్ లు 577 మార్కులు, శ్రీ మాధవ్ సాయి కిరణ్, అండ్ కే సాయి కౌశల్ 576, ఎస్. మహాలక్ష్మి 574, పి. హన్సిక 571, కె. ప్రణతి అండ్ వి. సుప్రీత 570 మార్కులు రావడం జరిగింది అన్నారు.ఈ సందర్భంగా వారు పాఠశాలలో విజయోత్సవ సభ నిర్వహించి అత్యున్నత మార్కులతో ప్రతిభ కనిపించిన విద్యార్థులు అందర్నీ కూడా డైరెక్టర్, ప్రిన్సిపాల్ తో పాటు బోధనేతర బృందము, తల్లిదండ్రులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. మున్ముందు మరింత అభివృద్ధిని సాధిస్తామని వారు దీమాను వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img