Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

గన్నవరం టిడిపి కార్యాలయంపై వైసీపీ అల్లరి మూకల దాడి పిరికి పంద చర్య

టిడిపి నాయకులు

విశాలాంధ్ర – ధర్మవరం:: గన్నవరం టిడిపి కార్యాలయం పై తెలుగుదేశం పార్టీ నాయకులపై వైసీపీ అల్లరి రౌడీ మూకల దాడి పిరికిపంద చర్య అని టిడిపి నాయకులు కమతం కాటమయ్య,పురుషోత్తం గౌడ్, నాగూరు హుస్సేన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని టిడిపి కార్యాలయంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ
ఓటమి భయంతోనే వైసిపి రౌడీ మూకల దాడులు చేశారని,రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా ?అనే అనుమానం కలుగుతోందన్నారు.రాష్ట్రంలో అరాచక, విద్యంసకర పాలన, కొనసాగుతోందని, తీవ్రస్థాయిలో వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.ఈ సందర్భంగా సోమవారం గన్నవరం నియోజకవర్గంలో , వైసిపి అల్లరి మూకలు జరిపిన దుశ్చర్య సంఘటనలపై తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వైసిపి ప్రభుత్వం పైన,వైసిపి చేస్తున్న దుశ్చర్యల పైన తీవ్రస్థాయిలో పై చర్యలను ముక్తకంఠంతో ఖండించారు.రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతుందని,వైసిపి నాయకులు అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీల పైన దాడులు కొనసాగిస్తూనే ,మహిళల పైన హత్య అత్యాచార దాడులు చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం బ్రతికే ఉందా ?అనే అనుమానం కలుగుతోందని తెలిపారు.గన్నవరంలో జరిగిన దాడులన్నీ వైసిపి ప్రభుత్వ ప్రేరేపితమైన దాడులు గానే భావించాల్సి వస్తోందని అన్నారు.తక్షణమే గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడులకు మూల సూత్రధారి అయిన గన్నవరం ఎమ్మెల్యే వంశీని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనంతు, సాహెబ్బి, కృష్ణాపురం జమీర్ అహ్మద్, మారుతి స్వామి, వల్లపు రవీంద్ర, చింతపులుసు పెద్దన్న, రాళ్లపల్లి షరీఫ్, చిత్రా రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img