Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రులు విమర్శలు చేస్తే సహించేది లేదు

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రులు విమర్శలు చేస్తే, సహించేది లేదంటూ ఖబర్దార్ అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఫైర్ అయ్యారు.. ఈ సందర్భంగా వారి స్వగృహంలో సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎవరితోనైనా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారని, అడగడానికి వైసిపి మంత్రులు ఎవరని వారు ప్రశ్నిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు వైసిపి పాలనలో విసుకు చెందారని, ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారని, 2024లో ప్రజలు తప్పక వైసిపి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని తెలిపారు. దుర్మార్గపు పాలనను అంతమందించాలంటే కచ్చితంగా ప్రతిపక్షాలు ఏకం కావలసిన సమయం ఆసన్నమైనదని వారు తెలిపారు. గత నాలుగు సంవత్సరాల నుండి రాష్ట్రంలో అరాచక, దుర్మార్గపు పాలన సాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అపద్రత భావన ఉండటం వల్లనే తమ అధినేత పవన్ కళ్యాణ్ పై జగన్ తో పాటు మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని తమ అధినేత పవన్ కళ్యాణ్ కలిస్తే వైసిపి మంత్రులకు వచ్చిన నష్టమేమో మాకు అర్థం కాలేదని తెలిపారు. మంత్రులు రోజా, పేర్ని నాని, కొడాలి నాని లు పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని ఇకపై మా కార్యకర్తలపై దాడులు చేస్తే,ఊరుకుండేది లేదని వారు గట్టిగా హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే, పోలీసులతో కేసులు పెట్టించినంతమాత్రాన, భయపడేది లేదని వారు తెలిపారు.-

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img