: మంత్రి ఆదిమూలపు సురేష్
ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లు, విద్యాదీవెనపై అప్పీల్కు వెళ్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళవారం మీడియాతో చెప్పారు. ఆయన మాట్లాడుతూ, కొన్ని కళాశాలల్లో పీఆర్వో వ్యవస్థ విద్యాదీవెన కోసమే అడ్మిషన్లు చేస్తున్నాయన్నారు. పూర్తి పారదర్శకత కోసమే ఆన్లైన్ విధానమని. డిగ్రీ అడ్మిషన్లలో ఆన్లైన్ విధానం విజయవంతమైందని తెలిపారు. తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తే జవాబుదారీతనం ఉంటుందని, యాజమాన్యానికి ఇస్తే పిల్లల చదువుల బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు.