ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 31,884 నమూనాలు పరీక్షించగా 166 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారినపడి గడిచిన 24 గంటల్లో గుంటూరులో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. కరోనా బారినుంచి గడిచిన 24 గంటల్లో 91 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,154 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది.