Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

ఏపీలో కొత్తగా 2,526 కరోనా కేసులు


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 93,785 శాంపిల్స్‌ పరీక్షించగా.. 2,526 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 19,32,105కి చేరింది. ఇందులో యాక్టివ్‌ కేసులు 25,526 ఉండగా.. 18,93,498 మంది వైరస్‌ నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనాతో నిన్న 24 మంది కోవిడ్‌ కారణంగా మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,081కి చేరుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img