విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: పోలీసులపై వచ్చే ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల సంస్థ పేరుతో కమిటీని ఏర్పాటు చేశారు. పదవీ విరమణ పొందిన ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అథారిటీ సభ్యులుగా ఉదయలక్ష్మి (రిటైర్డ్ ఐఏఎస్), కేవీబీ గోపాలరావు (రిటైర్డ్ ఐపీఎస్), బత్తిన శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ సభ్యులు…పోలీసులపై వచ్చే ఫిర్యాదులు నమోదు చేసి… పరీశీలిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు విశాఖపట్నం కేంద్రంగా, ఉమ్మడి కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలకు రాజమండ్రి కేంద్రంగా, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు గుంటూరు, రాయలసీమ జిల్లాలకు కర్నూలు కేంద్రంగా మరో కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి కేంద్రంలో ముగ్గురు పదవీ విరమణ చేసిన డీఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి అధికారులను నియమించాలని నిర్ణయం తీసుకుంది.