Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

భారతీ సిమెంట్‌ రేటుపై లేని నియంత్రణ ‘భీమ్లా నాయక్‌’పై ఎందుకు..?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలో ఏ వ్యవస్థను ముఖ్యమత్రి జగన్‌ వదలట్లేదని, చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ‘‘భీమ్లానాయక్‌’’ సినిమా విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందని అన్నారు. వ్యక్తులను టార్గెట్‌గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.భారతీ సిమెంట్‌ రేటుపై లేని నియంత్రణ ‘భీమ్లా నాయక్‌’ సినిమాపై ఎందుకు..? అని ఆయన ప్రశ్నించారు. ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్‌.. తన మూర్ఖపు వైఖరి వీడాలని హితవుపలికారు.రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి.. థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలన్నీ ప్రయత్నం చేస్తుంటే.. ఏపీ సీఎం మాత్రం భీమ్లా నాయక్‌పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారని యెద్దేవా చేశారు.‘భీమ్లా నాయక్‌’ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img