భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అరుదైన సరికొత్త ప్రయోగాలకు తెరతీసింది. ఇప్పటివరకు పీఎస్ఎల్వి, జీఎస్ఎల్వి లాంటి భారీ ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో ఈసారి చిన్న రాకెట్లను రోదసీలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎస్ఎల్వికి రూపకల్పన చేసింది. రేపు నింగిలోకి దూసుకెళ్లనున్న సరికొత్త రాకెట్ ప్రయోగం కోసం షార్లో సర్వం సిద్ధమయ్యింది.