కోస్తా, రాయలసీమల్లో రేపు కూడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. చత్తీస్గఢ్, ఒడిశా, ఏపీ, హైదరాబాద్కు తూర్పు దిశలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిరది. ఇది క్రమంగా తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతం మీదుగా అరేబియా సముద్రం వైపు కదులుతోంది. దీనివల్ల గాలుల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుంది.ఈ ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్రలో వానలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో ఆవరణం వరకు విస్తరించి కొనసాగుతోంది. సముద్రంలో తూర్పు, పశ్చిమ గాలుల కలయికతో ఏర్పడిన షియర్ జోన్ సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కి.మీ. మధ్య విస్తరించి ఉంది. వీటి ప్రభావంతోనూ వానలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది.