Friday, March 24, 2023
Friday, March 24, 2023

రెండు తలల పాములు అమ్మే గ్యాంగ్..9మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

డబ్బులు, రెండు పాములు, కార్లు సీజ్
రెండు తలల పాముల విక్రయించే ముఠా ఆట కట్టించారు పోలీసులు. ట్రావెల్స్‌ వ్యాపారం చేసుకుంటున్న మాణిక్‌రెడ్డి జ్యోతినగర్‌లో ఉంటున్నారు. అతడు రెండు తలల పాములు కావాలని చిత్తూరుకు చెందిన నవీన్‌, భాస్కర్‌, చంద్రశేఖర్‌, గోపాల్‌, ప్రసాద్‌, యుగంధర్‌లకు ఫోన్‌లో చెప్పాడు. వాటిని తెచ్చిస్తే అధిక మొత్తంలో డబ్బులు ఇస్తానని చెప్పడంతో నమ్మారు.. వాటిని నల్లమల అడవుల్లోంచి మాణిక్‌రెడ్డి ఇంటికి తెచ్చారు. ఆ పాముల వీడియోను తీసి కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన రమేష్‌, విజయ్ కుమార్, మహమ్మద్‌ భాషా, సికిందర్‌ షేక్‌, రాఘవేందర్‌‌లకు పంపారు. ఈ గ్యాంగ్ పాముల్ని కొనుగోలు చేయడానికి గురువారం మాణిక్‌రెడ్డి ఇంటికి రావడంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితుల్లో యుగంధర్‌, గోపాల్‌, ప్రసాద్‌లు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని 9 మందిని రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రెండు కార్లు, లక్షా 90 వేలు నగదు, రెండు పాములు, 10 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img