వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల
అందరితో చర్చించే ఆన్లైన్ టికెట్ విధానంపై ముందుకెళ్తామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ని ప్రజలంతా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని అన్నారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం ఇండస్ట్రీ వాళ్లతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలని ముందు నుంచి చెప్తున్నారు. కొద్దిమంది చేతిలో ఉన్న వ్యవస్థను సరళీకృతం చేస్తాం. సినిమా పెద్దలు ఎప్పుడైనా సీఎంను కలవొచ్చు. చంద్రబాబులా మేము పిలిచి ఫొటోలు దిగి పబ్లిసిటీ చేసుకునే వాళ్లం కాదని అన్నారు. ప్రభుత్వం ఒక మంచి విధానం తెస్తుంటే పవన్కల్యాణ్ తన స్వార్థం కోసం మాట్లాడుతున్నారని అన్నారు.