Friday, April 19, 2024
Friday, April 19, 2024

అందుకే బొత్స ఆ వ్యాఖ్యలు చేశారేమో.. : ఎంపీ రఘురామ కృష్ణరాజు

ఏపీ రాజధాని హైదరాబాదేనని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సెటైర్లు పేల్చారు. అమరావతి నుంచి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు ప్రతిసారీ వెళ్లిరావాలంటే రోజుకు రూ.60 లక్షల ఖర్చవుతుందని.. ఇది వరకు ముఖ్యమంత్రి కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారని.. ఆ ఖర్చును తగ్గించడానికి సీఎం హైదరాబాద్‌ నుంచే పాలన సాగిస్తూ.. అక్కడి నుంచే కోర్టుకు వెళ్లిరావడానికి సౌకర్యంగా ఉంటుందని బొత్స ఆ వ్యాఖ్యలు చేశారేమో తెలియదన్నారు.ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో మంత్రి గౌతంరెడ్డికి నివాళులర్పించి.. మాజీ ముఖ్యమంత్రి రోశయ్యను విస్మరించడం సరికాదన్నారు రఘురామ. పేదలకు చౌకగా సినిమా చూపెట్టాలన్న ఉద్దేశంతో ఇదివరకు సినిమా టికెట్ల ధరలను తగ్గించినట్లు చెప్పిన సీఎం ఎప్పుడు అదే పేదలకు అన్యాయం చేయడానికి ధరలను పెంచారా అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్‌ ప్రధాని మోదీ తండ్రిలా చూసుకుంటున్నారన్న ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని.. అప్పుల్లో పడి చెడిపోతున్న కొడుకును తండ్రి సరిదిద్దినట్లుగానే ప్రధాని మోదీ ఏపీ ముఖ్యమంత్రిని సరిదిద్ది రాష్ట్రానికి మేలు చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img