సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
అగ్నిపథ్ కేసులపై మంత్రులు, ముఖ్యమంత్రి స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ కేసులలో అరెస్ట్ అయిన బాధిత కుటుంబాలను జిల్లా కోర్టులో సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ళ, జంగాల అజయ్ తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, అగ్నిపథ్ కేసులో అరెస్ట్ అయిన బాధితులకు సీపీిఐ అండగా ఉంటుందన్నారు. బాధితులకు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఇలాంటి కేసుల వల్ల పోలీసు శాఖపై ఉండే గౌరవం పోతుందన్నారు.