Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అచ్చెన్నాయుడు అప్పుడు కాళ్లు పట్టుకున్నాడు: వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును టార్గెట్ చేసి.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు ఓ సమయంలో.. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారని.. ఆ విషయం పెద్దది అయ్యిందని.. అప్పుడు అచ్చెన్నాయుడు చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయని.. తన జోలికి వస్తే.. అందరి చిట్టా విప్పుతానని వల్లభనేని వంశీ వార్నింగ్ ఇచ్చారు.ఃపార్టీ లేదు బొక్కా లేదు.. గట్టి చెట్నీ వేయమన్న వ్యక్తి అచ్చెన్నాయుడు. ఆయన ఓ మహిళా ఆఫీసర్‌పై అసభ్యంగా ప్రవర్తించి.. చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారు. అచ్చెన్నాయుడు నా గురించి మాట్లాడితే.. నేను అందరి చిట్టా విప్పుతాః అని వల్లభనేని వంశీ వ్యాఖ్యనించారు. చంద్రబాబు (జష్ట్రaఅసతీaపaపబ) బహిరంగ లేఖపైనా వల్లభనేని వంశీ కౌంటర్‌ ఇచ్చారు. ఃచంద్రబాబుకు అధికారం దక్కలేదని మా కుల పత్రికలు బాధలో ఉన్నాయి. అందుకే కావాలని గోబెల్‌ ప్రచారం చేస్తున్నాయి. చేతకానోడు రాసే ఉత్తరాలతో ఉపయోగం లేదు. చంద్రబాబు డబ్బు కోసం పదవులు అమ్ముకున్నాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు జగన్‌. అందుకే బీసీలకు పదవుల్లో సముచిత స్థానం కల్పించారుః అని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img