అటవీ భూముల కబ్జాపై ఆరోపణలు అవాస్తవమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అటవీ భూముల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. వివాదాస్పద 10వేల ఎకరాలపై విచారణ జరుగుతోందన్నారు. అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో జాయింట్ సర్వే కొనసాగుతోందన్నారు. అటవీ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.