Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అదృశ్యమైన నలుగురు చిన్నారుల్లో ముగ్గురి ఆచూకీ లభ్యం

గుంటూరుజిల్లా మంగళగిరిలో అదృశ్యమైన నలుగురు చిన్నారుల్లో ముగ్గురి ఆచూకీ లభ్యమైంది. మంగళగిరి గుడి సమీపంలో ఉన్న పిల్లల్ని స్థానికులు గుర్తించారు.వారి ఫోటోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవడంతో స్థానికులు చిన్నారులను గుర్తించగలిగారు. వెంటనే చిన్నారులను స్థానికులు పోలీస్‌స్టేషన్‌ వద్దకు తీసుకువచ్చారు. పోలీసులు తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించారు. మరో పిల్లాడి ఆచూకీ ఇంకా లభ్యం కావల్సి ఉంది. ఆ చిన్నారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్థానికంగా ఉండే రాజీవ్‌ కల్పకు చెందిన విద్యార్థులు వెంకటేష్‌, ప్రభుదేవా, సంతోష్‌, ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు. మరో విద్యార్థి వెంకటేష్‌ ఎర్రబాలెంలోని ఓ ప్రైవేటు స్కూలులో చదువుతున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఉదయం స్కూల్‌కి వెళ్లి బ్యాగులు తరగది గదిలో పెట్టి బయటకు వెళ్లారు. మళ్లీ సాయంత్రం వచ్చి బ్యాగులు తీసుకొని వెళుతుండగా ఉపాధ్యాయులు గమనించి వారిని ప్రశ్నించారు. ఉదయం తల్లిదండ్రులను తీసుకొని పాఠశాలకు రావాలని చెప్పడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఎర్రబాలెంలోని పాఠశాల విద్యార్థి వెంకటేష్‌తో కలిసి బయటకు వెళ్లిపోయారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img