Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వదిలేసి..ఖండిరచిన మహిళలను వేధిస్తారా?

టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యులు అచ్చెన్నాయుడు
శాసనసభలో వైసీపీ నేతల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిరచిన అనంతపురం తెలుగు బీసీ మహిళా నేతల్ని పోలీసులు వేధించటం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను వదిలేసి..వారిని వ్యాఖ్యలను ఖండిరచిన తెలుగు మహిళలను వేధిస్తారా అని ప్రశ్నించారు. వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన వైసీపీ ప్రజాప్రతినిధులకు భద్రత పెంచిన ప్రభుత్వం..మహిళలను కించపరిచేలా మాట్లాడొద్దన్నందుకు తెలుగు మహిళలను అరెస్టు చేస్తామని బెదిరించటం సిగ్గుమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి మహిళలపై గౌరవం ఉంటే అసెంబ్లీలో మహిళలను అవమానించిన వారిని పదవుల నుంచి తొలగించి మహిళలకు క్షమాపణలు చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img