Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అన్ని హామీలను మొదటి ఏడాదిలోనే 95 శాతం అమలు : సజ్జల

ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కొని సీఎం వైఎస్‌ జగన్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను మొదటి ఏడాదిలోనే 95 శాతం అమలు చేశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏ పథకంలో కూడా అంతరాయం లేకుండా పూర్తి చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకువచ్చిన పథకాలు సామాన్యమైనవి కావని, గ్రామ సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థ ప్రస్తుతం జనజీవనంలో భాగమయ్యాయని పేర్కొన్నారు.రాష్ట్ర విభజన జరిగిన ఐదేళ్ల తర్వాత చంద్రబాబు పాలనను ప్రజలు తిరస్కరించారని అన్నారు. 30మే 2019లో అధికారం చేపట్టి 2020, 2021 సంవత్సరాలను పూర్తి చేసుకుందని పేర్కొన్నారు. 2020లో ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ విస్తరించిందని తెలిపారు. అప్పటికే టీడీపీ ప్రభుత్వం మిగిల్చిన రుణభారంతో రాష్ట్రం కుంగిపోయిందని.. కరోనా కూడా దెబ్బకొట్టిందని చెప్పారు. . ఎన్ని సవాళ్లు ఎదురైనా సీఎం జగన్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను మొదటి ఏడాదిలోనే 95 శాతం అమలు చేశారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img