ఏపీని డ్రగ్స్ రాజధానిగా క్రియేట్ చేస్తున్న చంద్రబాబు ఎలాంటి శిక్ష వేసినా తప్పులేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అబద్దాలు, డ్రామాలు, విధానాలను అలవోకగా మార్చడం చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య అని ఎద్దేవా చేశారు.జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు ఢల్లీి పర్యటన కొనసాగిందన్నారు. ఏపీలో సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ఈ కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టారని సజ్జల ఆరోపించారు. రాష్ట్రపతి పాలనపై రాష్ట్రపతి ఏమన్నారో ఏమో కానీ.. టీడీపీ నేతలు చెప్పాల్సింది చెప్పారు. కక్కాల్సింది కక్కారని మండిపడ్డారు. దిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ గురించి ప్రస్తావనే లేదని.. అసలు అమిత్ షాకు చంద్రబాబు ఏం ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. దిల్లీ పర్యటనతో చంద్రబాబు మీడియాను ఆకర్షించగలిగారు.. కానీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ డ్రగ్స్కు రాజధానిగా ఉందని చంద్రబాబు చెప్పడం ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమేనని అన్నారు. ఈ ఒక్క విషయంలోనే చంద్రబాబుపై కేసు పెట్టి శిక్ష విధించాల్సి ఉంటుందన్నారు. ఏపీ ఇమేజ్ డామేజ్ చేస్తున్న చంద్రబాబే ఉగ్రవాదానికి పాల్పడుతున్నారని.. ఈ ఉగ్రవాదాన్ని ఏమనాలో కూడా తమకు అర్థం కావడం లేదని మండిపడ్డారు