రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. పుంగనూరులో టీడీపీ నేతలు అరాచకాలు చేస్తే, చూస్తూ సహించాలా ? అని ప్రశ్నించారు. తనను చంద్రబాబునాయుడు హెచ్చరించడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ హయాం నుంచి చిత్తూరు జిల్లాలో టీడీపీ మెజార్టీ సాధించలేదని గుర్తు చేశారు. ఈ సారి కుప్పంలోనూ చంద్రబాబు జెండాను పీకేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీనే గెలుస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. కులాన్ని అడ్డుపెట్టుకుని పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు, ఆ కులానికి సంబంధించిన వంగవీటి రంగాను చంపించింది చంద్రబాబు కాదా ? అని నిలదీశారు.