నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం..టీడీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని స్మరించుకున్నారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అటు టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఇతర నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించారు.