అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ చేపట్టిన అమరావతి రైతుల మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రైతులతోపాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలిరావడంతో సభా ప్రాంగణంలోని గ్యాలరీలు నిండిపోయాయి. వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు సంఫీుభావం ప్రకటించాయి. ఈ ఉద్యమానికి అండగా నిలుస్తామంటూ వివిధ పార్టీ నేతలు రైతులకు భరోసా కల్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, వర్ల రామయ్య, పరిటాల సునీత, గౌతు శిరీష, శ్రవణ్ కుమార్, సీపీఐ నేత నారాయణ, రామకృష్ణ, నరసాపురం ఎంపీ రఘరామకృష్ణంరాజు, జనసేన నేత రామదాసు చౌదరి, బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిశోర్బాబు, పాతూరి నాగభూషణం, సినీనటుడు శివాజీ, కాంగ్రెస్ నేతలు తులసిరెడ్డి, మస్తాన్ వలీ తదితరులు హాజరయ్యారు.