Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అమరావతి రైతుల పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత

రాజధాని అమరావతి రైతుల మహా పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మూడోరోజు కొనసాగుతున్న వీరి పాదయాత్రలో భాగంగా తెనాలిలోని ఐతా నగర్‌ మీదుగా వెళ్లాలని రైతులు భావించారు. అయితే ఆ మార్గంలో వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ నివాసం ఉందని రైతులను ఆపేశారు. రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లను పెట్టారు. ఈ సందర్భంగా స్థానికులు రైతులకు సంఘాభావం తెలిపారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, స్థానికుల మధ్య స్వల్ప వాగ్వాదం, తోలపులాట చోటుచేసుకుంది. మరోవైపు ఐకాస నేత గద్దె తిరుపతి రావు మాట్లాడుతూ కోర్టు అనుమతులను ధిక్కరించకూడదు కాబట్టి… పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో బస్టాండు ప్రాంతం మీదుగా చినరావూరు, జంగడిగూడెం మీదుగా సాయంత్రానికి పెదరావూరు చేరుకుంటామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img