ఆంధ్రప్రదేశ్ని వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ సభలో రామకృష్ణ మాట్లాడుతూ, సీఎం జగన్ రెండేళ్లుగా రాష్ట్రంలో నిప్పుల కుంపటిని రాజేశారని అన్నారు. రాజధానిపై జగన్రెడ్డి మూడు ముక్కలాట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమానికి బీజేపీ రాష్ట్ర నేతల మద్దతు మాత్రమే ఉందన్నారు. మోదీ ఒక్క ఫోన్ చేస్తే జగన్ అమరావతిని కాదంటారా? అని ప్రశ్నించారు. హోంమంత్రి అమిత్షా ఫోన్ చేస్తే జగన్ శిరసావహిస్తారన్నారు. వైసీపీ తప్ప అన్ని పార్టీలు అమరావతినే రాజధానిగా కోరుతున్నాయన్నారు. తిరుపతి సభకు వస్తుంటే పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. అమరావతి ఉద్యమకారులను జైల్లో పెట్టించారని అన్నారు. ప్రాంతాల మధ్య జగన్ చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అమరావతే రాజధానిగా ఉంటుందని జగన్ ప్రకటించాలని డిమాండు చేశారు.