అమ్మఒడి కావాలంటే కరెంట్ 300 యూనిట్లు దాటకూడదా? అని ప్రశ్నించారు. ఇద్దరు పిల్లలున్నా అమ్మఒడి ఇస్తానని సీఎం జగన్ అన్నారన్నారు. ఇప్పుడు ఒక్కరికే ఇస్తామని షరతులు ఎలా పెడతారని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు.కృష్ణా నదిని నమ్ముకున్న మత్స్యకారుల పొట్ట కొడుతున్నారని విమర్శించారు. మత్స్యకారులకు పనులు లేక విలవిల్లాడుతున్నారన్నారు. కృష్ణా నదిలో వెంటనే చేప పిల్లలను వదలాలన్నారు. జీవో నెంబర్ 217ను తక్షణమే రద్దు చేయాలన్నారు.