Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అవినీతి, అబద్దాల పుట్ట వైసీపీ : చంద్రబాబు

అవినీతి, అబద్దాల పుట్ట వైసీపీ అని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. చేతగాని వాళ్లే కులం, మతం, ప్రాంతాలపై మాట్లాడతారని, సమర్థులు అభివృద్ధి గురించి ఆలోచన చేస్తారని అన్నారు. తెలుగువారంతా తమ కుటుంబ సభ్యులేనని, తెలుగువారే తన కులం, మతం అని చంద్రబాబు అన్నారు. పేటీఎం బ్యాచ్‌ను అడ్డుపెట్టుకుని టీడీపీపై విషప్రచారం చేశారని చంద్రబాబు విమర్శించారు.శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ వివేకానంద రెడ్డిని చంపి గుండెపోటు అని ప్రచారం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు వాస్తవాలు చెప్పి వైసీపీని ఓడిస్తామన్నారు. సానుభూతితో జగన్‌ ఓట్లు వేయించుకున్నారన్నారు. వివేకా హత్య, కోతి కత్తితో సానుభూతి పొందారని, ఇప్పుడు కోడి కత్తి ఎక్కడుందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. పోలవరాన్ని పరిగెత్తించి 72 శాతం పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఉంటే ఈపాటికి 100 శాతం పూర్తయ్యేదన్నారు. ప్రజల కష్టాలను వెలుగులోకి తేవాల్సిన బాధ్యత ఐటీడీపీ సభ్యులపై ఉందన్నారు. ఐటీడీపీ సభ్యులపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని, భయపడకుండా ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే అక్రమ కేసులను రద్దు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img