Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అవి ఫేక్‌ ట్వీట్లు : కేశినేని నాని

సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడి
సోషల్‌ మీడియాలో టీడీపీ ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం రేగింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢల్లీి పర్యటనను విమర్శిస్తున్నట్టుగా ఉన్న ఆ ట్వీట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై కేశినేని నాని స్పందించారు. సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న ట్వీట్లు తనవి కావని స్పష్టం చేశారు. ఫేక్‌ ట్వీట్లపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. అటు, ఎంపీ కేశినేని నాని కార్యాలయం అవి ఫేక్‌ ట్వీట్లు అంటూ స్పష్టం చేసింది. వాటిని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img