వైసీపీలోని అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు వైసీపీ హై కమాండ్ ప్రయత్నిస్తోంది.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పార్టీలోని అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు ఎంపీ మోపిదేవిని రంగంలోకి దించింది. అందరికీ భవిష్యత్తులో ప్రాతినిధ్యం కల్పిస్తామని తన మాటగా చెప్పాలని మోపిదేవి ద్వారా సీఎం జగన్ సమాచారం పంపారు. దీంతో మోపిదేవి నిన్న మాజీ హోంమంత్రి సుచరిత, ఈ రోజు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని కలిశారు. అయితే మాజీ హోంమంత్రి సుచరిత మోపిదేవికి రాజీనామా లేఖ ఇచ్చారు.ఎమ్మెల్యే పార్థసారథి కూడా తన సీనియారిటీ పనికి రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభానును కలవడం కోసం మోపిదేవి ప్రయత్నిస్తున్నారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.ఉదయభాను అనుచరులు రోడ్డుపై టైర్లు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు.