వైద్య, ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. మంత్రి విడదల రజనీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేయనున్నట్టు తెలిపారు. ఇక ఆరోగ్య శ్రీలోకి మరిన్ని వైద్య సేవలు చేర్చనున్నారు. అదనంగా కొత్త ప్రొసీజర్లు చేర్చాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.