సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి
ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలని, వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు.రాష్ట్రానికి ఆదాయం అందించే శాఖలపై సీఎం జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,ఆదాయ వనరులపై వినూత్న సంస్కరణలు తీసుకురావాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై దృష్టి సారించాలని, ప్రతి ఏటా సహాజంగా పెరిగే ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్లపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.అవినీతికి చోటు లేకుండా పూర్తిస్థాయిలో మార్పులు చేశామని అధికారులు తెలిపారు. మీ-సేవల్లో పరిస్థితులపైనా పరిశీలన చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.